Breaking News
తాజా బ్రేకింగ్ వార్తలు ఇక్కడ అప్‌డేట్ చేయబడతాయి...
www.ntodaynews.com

చిన్నంపేట గ్రామంలో జనసేన జెండా దిమ్మ ఏర్పాటును పరిశీలించిన జనసేన నేత మరీదు శివరామకృష్ణ

ఆంధ్రప్రదేశ్
గడ్డం జగన్మోహన్ రెడ్డి
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Mar, 2026
22 వీక్షణలు

NTODAY NEWS:- ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చిన్నంపేట గ్రామంలో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు పనులను నూజివీడు నియోజకవర్గ నాయకులు మరియు ఉమ్మడి కృష్ణా జిల్లాల అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ పరిశీలించారు. గ్రామానికి చెందిన జనసేన నాయకుడు తేళ్ళూరి ప్రసాద్ స్వంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్న జెండా దిమ్మ పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మరీదు శివరామకృష్ణ మాట్లాడుతూ, పార్టీపై ఉన్న అభిమానంతో తేళ్ళూరి ప్రసాద్ స్వంత ఖర్చులతో జనసేన జెండా దిమ్మను నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తున్న ప్రసాద్ వంటి నాయకులు ఉండటం జనసేనకు గర్వకారణమని అన్నారు. త్వరలో జరగనున్న జెండా దిమ్మ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు పార్టీ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్, కూటమి నాయకులు, చాట్రాయి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ, జనార్ధనవరం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మాదాసు చిన్న పుల్లయ్య, నాగుల అశోక్, చింతా సాయి, మణికంఠతో పాటు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.