చిట్యాల మండలంలో బీఎల్ఓలకు శిక్షణ
జూన్ 25 నుండి ఇంటింటి సర్వే ప్రారంభం
నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు తహసీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన ఈ శిక్షణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న బీఎల్ఓలకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇతర అవసరమైన మెటీరియల్ను పంపిణీ చేశారు. ఇంటింటి సర్వే షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుండి బీఎల్ఓలు మండల వ్యాప్తంగా ఇంటింటి సర్వే ప్రారంభించనున్నారు. చిట్యాల మండలంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, విజయవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ సుధాకర్ రెడ్డి, మండలంలోని బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.