BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి..

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
19 Jun, 2026 - 10:07 PM
87 వీక్షణలు

రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. చంద్రబాబుతో భేటీ తర్వాత సాయికృష్ణ కుటుంబం

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపిన విజయవాడ కృష్ణలంక గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబునాయుడును శుక్రవారం కలిశారు.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసిన విజయలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు.. సాయికృష్ణ అదృశ్యం ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమెకు ధైర్యం చెప్పిన చంద్రబాబు, సాయికృష్ణ అదృశ్యం ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని వారికి హామీ ఇచ్చారు. సీఎం హామీపై సంతృప్తి వ్యక్తం చేసిన విజయలక్ష్మి.. చంద్రబాబును కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు విజయలక్ష్మి తెలిపారు.

అనంతరం విలేకర్లతో మాట్లాడిన సాయికృష్ణ కుటుంబసభ్యులు.. కేసులో న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఇది కేవలం పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఘటనగా భావిస్తున్నట్లు సాయికృష్ణ మేనమామ నవరంగ్ మీడియాకు తెలిపారు. " చంద్రబాబు మా బాధలు విన్నారు. మా కష్టాలు తీరుస్తామని భరోసా ఇచ్చారు. అన్యాయం చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి.. జైలుకు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సాయికృష్ణ తల్లికి చంద్రబాబు ఇచ్చిన భరోసా కంటే మాకు ఇంకేమీ అవసరం లేదు." అని నవరంగ్ తెలిపారు.

"ఇది రాజకీయ పరమైన విషయం కాదు. పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఓ ఘటన. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయికృష్ణకు అన్యాయం జరిగి ఉంటే.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మా కుటుంబం కోరుకుంటోంది కూడా అదే. ఈ రాజకీయ పార్టీలు, కులాలు, మతాలతో మాకు సంబంధం లేదు. ఈ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. తల్లి బాధను చంద్రబాబు అర్థం చేసుకున్నారు. సామాన్యుడికి న్యాయం జరగదని అనుకున్నాం.. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చొరవతో మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చింది. రాజకీయంగా ఎవరిపైనా మాకు ద్వేషం లేదు. ఇలాంటి అన్యాయం ఇంకో వ్యక్తికి జరగకూడదు" అని నవరంగ్ అన్నారు.

ఇది రాజకీయ పరమైన విషయం కాదు. పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఓ ఘటన. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయికృష్ణకు అన్యాయం జరిగి ఉంటే.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మా కుటుంబం కోరుకుంటోంది కూడా అదే. ఈ రాజకీయ పార్టీలు, కులాలు, మతాలతో మాకు సంబంధం లేదు. ఈ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. తల్లి బాధను చంద్రబాబు అర్థం చేసుకున్నారు. సామాన్యుడికి న్యాయం జరగదని అనుకున్నాం.. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చొరవతో మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చింది. రాజకీయంగా ఎవరిపైనా మాకు ద్వేషం లేదు. ఇలాంటి అన్యాయం ఇంకో వ్యక్తికి జరగకూడదు" అని నవరంగ్ అన్నారు.