www.ntodaynews.com
చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో శనివారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కృత్తికా శుక్ల, ఎస్పీ కృష్ణారావు హెలిప్యాడ్, అంగన్వాడీ కేంద్రం, సభా ప్రాంగణాలను పరిశీలించి భద్రతను సమీక్షించారు. పర్యటనలో భాగంగా సీఎం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం 'అన్నదాత సుఖీభవ' ద్వారా రైతులకు రూ. 7,000 జమ చేయడం, 'స్వచ్ఛ్ ఆంధ్ర' ప్రారంభం, కూటమి రెండేళ్ల విజయోత్సవ సభలో సీఎం పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు ఆయన తిరుగుపయనమవుతారని అధికారులు తెలిపారు.