BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
19 Jun, 2026 - 02:21 PM
91 వీక్షణలు

పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి శాసనసభ్యులు  ప్రత్తిపాటి పుల్లారావు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఈ నెల 20వ తేదీ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ప్రోటోకాల్ మంత్రి పెందుర్తి వెంకటేష్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ఉదయం 11:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ముఖ్యమంత్రి కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మొదట అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తారని తెలిపారు. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి స్థానిక రైతులతో ముఖాముఖి మాట్లాడతారని పేర్కొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభ నుంచి 'స్వచ్ఛ్ ఆంధ్ర' కార్యక్రమంతో పాటు, అత్యంత ప్రతిష్టాత్మకమైన 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా (పీఎం కిసాన్ యోజన నిధులతో కలిపి) రూ. 7,000 చొప్పున రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు. ఇదే సభలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవంపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ భారీ బహిరంగ సభలో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ పట్టాభి తదితరులు పాల్గొననున్నారు. పర్యటన ముగిసిన అనంతరం సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల హెలిపాడ్ నుండి సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికితిరుగుపయనమవుతారని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.