BREAKING
ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ
www.ntodaynews.com

పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
19 Jun, 2026 - 02:21 PM
20 వీక్షణలు

పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి శాసనసభ్యులు  ప్రత్తిపాటి పుల్లారావు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఈ నెల 20వ తేదీ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ప్రోటోకాల్ మంత్రి పెందుర్తి వెంకటేష్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ఉదయం 11:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ముఖ్యమంత్రి కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మొదట అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తారని తెలిపారు. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి స్థానిక రైతులతో ముఖాముఖి మాట్లాడతారని పేర్కొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభ నుంచి 'స్వచ్ఛ్ ఆంధ్ర' కార్యక్రమంతో పాటు, అత్యంత ప్రతిష్టాత్మకమైన 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా (పీఎం కిసాన్ యోజన నిధులతో కలిపి) రూ. 7,000 చొప్పున రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు. ఇదే సభలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవంపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ భారీ బహిరంగ సభలో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ పట్టాభి తదితరులు పాల్గొననున్నారు. పర్యటన ముగిసిన అనంతరం సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల హెలిపాడ్ నుండి సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికితిరుగుపయనమవుతారని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.