BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
19 Jun, 2026 - 02:21 PM
59 వీక్షణలు

పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి శాసనసభ్యులు  ప్రత్తిపాటి పుల్లారావు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఈ నెల 20వ తేదీ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ప్రోటోకాల్ మంత్రి పెందుర్తి వెంకటేష్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ఉదయం 11:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ముఖ్యమంత్రి కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మొదట అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తారని తెలిపారు. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి స్థానిక రైతులతో ముఖాముఖి మాట్లాడతారని పేర్కొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభ నుంచి 'స్వచ్ఛ్ ఆంధ్ర' కార్యక్రమంతో పాటు, అత్యంత ప్రతిష్టాత్మకమైన 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా (పీఎం కిసాన్ యోజన నిధులతో కలిపి) రూ. 7,000 చొప్పున రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు. ఇదే సభలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవంపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ భారీ బహిరంగ సభలో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ పట్టాభి తదితరులు పాల్గొననున్నారు. పర్యటన ముగిసిన అనంతరం సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల హెలిపాడ్ నుండి సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికితిరుగుపయనమవుతారని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.