BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి PGRS కార్యక్రమం – ప్రజలకు కీలక సూచన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 06:43 AM
62 వీక్షణలు

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఐఏఎస్ ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ మరియు 4వ సోమవారాల్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమానికి నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఐఏఎస్‌తో పాటు నూజివీడు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు తప్పనిసరిగా హాజరుకానున్నారు.

దీనిలో భాగంగా సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించే PGRS కార్యక్రమానికి నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నతో పాటు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు హాజరవుతారు.

ప్రతి వారం నిర్వహించే PGRS కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారు.

అయితే ప్రతి నెల 1వ మరియు 4వ సోమవారాల్లో సబ్ కలెక్టర్ ఏలూరు కలెక్టరేట్‌లో జరిగే PGRS కార్యక్రమానికి హాజరయ్యే కారణంగా, ఆ రోజుల్లో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (డీఏఓ) ప్రజల వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తారు.

మిగిలిన 2వ మరియు 3వ సోమవారాల్లో నూజివీడు సబ్ కలెక్టర్ స్వయంగా కార్యాలయంలో నిర్వహించే PGRS కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.

ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత సోమవారాల్లో PGRS కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ కార్యాలయం సూచించింది.