BREAKING
యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
www.ntodaynews.com

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి PGRS కార్యక్రమం – ప్రజలకు కీలక సూచన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 06:43 AM
24 వీక్షణలు

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఐఏఎస్ ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ మరియు 4వ సోమవారాల్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమానికి నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఐఏఎస్‌తో పాటు నూజివీడు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు తప్పనిసరిగా హాజరుకానున్నారు.

దీనిలో భాగంగా సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించే PGRS కార్యక్రమానికి నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నతో పాటు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు హాజరవుతారు.

ప్రతి వారం నిర్వహించే PGRS కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారు.

అయితే ప్రతి నెల 1వ మరియు 4వ సోమవారాల్లో సబ్ కలెక్టర్ ఏలూరు కలెక్టరేట్‌లో జరిగే PGRS కార్యక్రమానికి హాజరయ్యే కారణంగా, ఆ రోజుల్లో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (డీఏఓ) ప్రజల వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తారు.

మిగిలిన 2వ మరియు 3వ సోమవారాల్లో నూజివీడు సబ్ కలెక్టర్ స్వయంగా కార్యాలయంలో నిర్వహించే PGRS కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.

ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత సోమవారాల్లో PGRS కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ కార్యాలయం సూచించింది.