BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి PGRS కార్యక్రమం – ప్రజలకు కీలక సూచన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 06:43 AM
92 వీక్షణలు

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఐఏఎస్ ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ మరియు 4వ సోమవారాల్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమానికి నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఐఏఎస్‌తో పాటు నూజివీడు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు తప్పనిసరిగా హాజరుకానున్నారు.

దీనిలో భాగంగా సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించే PGRS కార్యక్రమానికి నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నతో పాటు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు హాజరవుతారు.

ప్రతి వారం నిర్వహించే PGRS కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారు.

అయితే ప్రతి నెల 1వ మరియు 4వ సోమవారాల్లో సబ్ కలెక్టర్ ఏలూరు కలెక్టరేట్‌లో జరిగే PGRS కార్యక్రమానికి హాజరయ్యే కారణంగా, ఆ రోజుల్లో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (డీఏఓ) ప్రజల వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తారు.

మిగిలిన 2వ మరియు 3వ సోమవారాల్లో నూజివీడు సబ్ కలెక్టర్ స్వయంగా కార్యాలయంలో నిర్వహించే PGRS కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.

ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత సోమవారాల్లో PGRS కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ కార్యాలయం సూచించింది.