BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
19 Jun, 2026 - 07:57 PM
75 వీక్షణలు

రాజీవుని ఆశయ సాధకుడు భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ

చిలకలూరిపేటలో జాతీయ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన, విద్యార్థి కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ప్రైవేట్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన సుభాని, పట్టణంలో ఎంఈసి గ్రూపులో ప్రథమ స్థానం సాధించిన చిరంజీవి అనే విద్యార్థులను చిలకలూరిపేట విద్యా సంఘం ప్రధాన కార్యదర్శి మైలవరపు శివానంద కుమార్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు ప్రభాకర్ ఆ విద్యార్థుల భవిష్యత్తు చదువుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు.రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. రాధాకృష్ణ, మాజీ కార్యదర్శి ఉప్పుటూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ సాంకేతిక భారతదేశ నిర్మాణమే ధ్యేయంగా రాజీవ్ గాంధీ అప్పట్లో తెచ్చిన 'యంగ్ ఇండియా' నినాదాన్ని, ఆయన ఆశయాలను రాహుల్ గాంధీ మాత్రమే ముందుకు తీసుకెళ్లగలరని అన్నారు. యువత, విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, వారి అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా, నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్, యువజన, ఎన్‌ఎస్‌యుఐ (NSUI) నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.