BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
19 Jun, 2026 - 07:57 PM
10 వీక్షణలు

రాజీవుని ఆశయ సాధకుడు భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ

చిలకలూరిపేటలో జాతీయ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన, విద్యార్థి కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ప్రైవేట్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన సుభాని, పట్టణంలో ఎంఈసి గ్రూపులో ప్రథమ స్థానం సాధించిన చిరంజీవి అనే విద్యార్థులను చిలకలూరిపేట విద్యా సంఘం ప్రధాన కార్యదర్శి మైలవరపు శివానంద కుమార్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు ప్రభాకర్ ఆ విద్యార్థుల భవిష్యత్తు చదువుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు.రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. రాధాకృష్ణ, మాజీ కార్యదర్శి ఉప్పుటూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ సాంకేతిక భారతదేశ నిర్మాణమే ధ్యేయంగా రాజీవ్ గాంధీ అప్పట్లో తెచ్చిన 'యంగ్ ఇండియా' నినాదాన్ని, ఆయన ఆశయాలను రాహుల్ గాంధీ మాత్రమే ముందుకు తీసుకెళ్లగలరని అన్నారు. యువత, విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, వారి అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా, నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్, యువజన, ఎన్‌ఎస్‌యుఐ (NSUI) నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.