www.ntodaynews.com
పెనుగొలను అంగన్వాడి కేంద్రాల్లో యోగాంధ్ర కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలను అంగన్వాడి కేంద్రాల్లో శనివారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, స్థానిక మహిళలు కలిసి వివిధ యోగాసనాలు ప్రదర్శించారు. అలాగే చిన్నారులకు సులభమైన యోగాసనాలు నేర్పించి, వారితో కలిసి సాధన చేయించారు.
వక్తలు మాట్లాడుతూ అన్ని వయసుల వారు క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. చిన్న వయసులోనే యోగా అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది పడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు పీ.వి. సాయి లక్ష్మి, ఎం. స్వరూపరాణి, బి. నాగమణి, కె. లింగమ్మ, డీ. దివ్య, సాయిబాబా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.