BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

పెనుగొలను అంగన్వాడి కేంద్రాల్లో యోగాంధ్ర కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 01:08 PM
31 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలను అంగన్వాడి కేంద్రాల్లో శనివారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, స్థానిక మహిళలు కలిసి వివిధ యోగాసనాలు ప్రదర్శించారు. అలాగే చిన్నారులకు సులభమైన యోగాసనాలు నేర్పించి, వారితో కలిసి సాధన చేయించారు.

వక్తలు మాట్లాడుతూ అన్ని వయసుల వారు క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. చిన్న వయసులోనే యోగా అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది పడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు పీ.వి. సాయి లక్ష్మి, ఎం. స్వరూపరాణి, బి. నాగమణి, కె. లింగమ్మ, డీ. దివ్య, సాయిబాబా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.