BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

విస్సన్నపేట చారిత్రక పంచాయతీ సమితి భవనం కూల్చివేతపై స్థానికుల్లో తీవ్ర చర్చ – ఒక యుగానికి తెరపడిందా?

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 10:24 AM
62 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం పరిధిలోని విస్సన్నపేటలో ఉన్న చారిత్రక పంచాయతీ సమితి భవనం కూల్చివేత స్థానికంగా పెద్ద సంచలనం రేపుతోంది. దశాబ్దాల పాటు గ్రామీణ పాలనకు గుండెకాయగా నిలిచిన ఈ పురాతన భవనం పూర్తిగా నేలమట్టం కావడంతో “ఒక యుగం ముగిసిపోయింది” అనే భావన గ్రామాల్లో బలంగా వినిపిస్తోంది.

ఒకప్పుడు సమితి కార్యాలయంగా కీలక కేంద్రంగా వెలిగిన ఈ భవనం ద్వారా విస్సన్నపేట, ఏ. కొండూరు, రెడ్డిగూడెం, చాట్రాయి మండలాల పరిధిలోని సుమారు 60 నుంచి 70 గ్రామాల పాలన సాగినట్లు స్థానికులు భావోద్వేగంగా గుర్తుచేస్తున్నారు. గ్రామీణ అభివృద్ధి పనులన్నీ ఇక్కడ నుంచే ప్రారంభమయ్యేవని, వందల మంది ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వేలమంది ప్రజలతో ఈ ప్రాంతం ఎప్పుడూ కిటకిటలాడేదని చెబుతున్నారు.

గ్రామీణ పాలన ప్రారంభ దశల్లో ఈ భవనం ఒక “పాలనా కేంద్ర బిందువు”గా నిలిచిందని, ఆ కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగినట్లు చర్చ జరుగుతోంది. ప్రత్యేకంగా ఆ సమయంలో నాయకత్వంలో గట్టి నిర్ణయాలతో పాలనా వ్యవస్థను ముందుకు నడిపిన ఇప్పటి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన గడ్డం సత్యనారాయణ రెడ్డి పది సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్ గా ఐదు సంవత్సరాలు మండలాధ్య‌‌క్షులుగా రెడ్డి గారు గా ముద్ర పడిన ఆయన పాత్రపై స్థానికుల్లో ఇప్పుడు మళ్లీ చర్చ వేడెక్కుతోంది.

ఆయన నేతృత్వంలో సమితి పాలన ఒక దశలో గ్రామీణ అభివృద్ధికి దిశానిర్దేశం చేసిందని, ఆ కాలపు జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రజల మాటల్లో వినిపిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అదే భవనం ఆ పాలనా చరిత్రకు నిదర్శనంగా నిలిచిందని వారు భావిస్తున్నారు.

ఇప్పుడు ఆ చారిత్రక నిర్మాణం పూర్తిగా కనుమరుగవడంతో, కనీసం గుర్తుగా అయినా దాన్ని సంరక్షించాల్సిందిగా స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్ తరాలకు గ్రామీణ పాలనా చరిత్రను చూపించే ఒక గుర్తుగా ఈ భవనం నిలిచే అవకాశం కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే, ఆ కాలపు పాలనా చరిత్రకు గుర్తుగా సమితి కార్యాలయం ముందు గడ్డం సత్యనారాయణ రెడ్డి విగ్రహం నెలకొల్పడం ఆయన పరిపాలన దక్షత కు నిదర్శనంగా ప్రజలు భావిచడం గమనార్హం