BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

విస్సన్నపేట చారిత్రక పంచాయతీ సమితి భవనం కూల్చివేతపై స్థానికుల్లో తీవ్ర చర్చ – ఒక యుగానికి తెరపడిందా?

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 10:24 AM
159 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం పరిధిలోని విస్సన్నపేటలో ఉన్న చారిత్రక పంచాయతీ సమితి భవనం కూల్చివేత స్థానికంగా పెద్ద సంచలనం రేపుతోంది. దశాబ్దాల పాటు గ్రామీణ పాలనకు గుండెకాయగా నిలిచిన ఈ పురాతన భవనం పూర్తిగా నేలమట్టం కావడంతో “ఒక యుగం ముగిసిపోయింది” అనే భావన గ్రామాల్లో బలంగా వినిపిస్తోంది.

ఒకప్పుడు సమితి కార్యాలయంగా కీలక కేంద్రంగా వెలిగిన ఈ భవనం ద్వారా విస్సన్నపేట, ఏ. కొండూరు, రెడ్డిగూడెం, చాట్రాయి మండలాల పరిధిలోని సుమారు 60 నుంచి 70 గ్రామాల పాలన సాగినట్లు స్థానికులు భావోద్వేగంగా గుర్తుచేస్తున్నారు. గ్రామీణ అభివృద్ధి పనులన్నీ ఇక్కడ నుంచే ప్రారంభమయ్యేవని, వందల మంది ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వేలమంది ప్రజలతో ఈ ప్రాంతం ఎప్పుడూ కిటకిటలాడేదని చెబుతున్నారు.

గ్రామీణ పాలన ప్రారంభ దశల్లో ఈ భవనం ఒక “పాలనా కేంద్ర బిందువు”గా నిలిచిందని, ఆ కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగినట్లు చర్చ జరుగుతోంది. ప్రత్యేకంగా ఆ సమయంలో నాయకత్వంలో గట్టి నిర్ణయాలతో పాలనా వ్యవస్థను ముందుకు నడిపిన ఇప్పటి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన గడ్డం సత్యనారాయణ రెడ్డి పది సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్ గా ఐదు సంవత్సరాలు మండలాధ్య‌‌క్షులుగా రెడ్డి గారు గా ముద్ర పడిన ఆయన పాత్రపై స్థానికుల్లో ఇప్పుడు మళ్లీ చర్చ వేడెక్కుతోంది.

ఆయన నేతృత్వంలో సమితి పాలన ఒక దశలో గ్రామీణ అభివృద్ధికి దిశానిర్దేశం చేసిందని, ఆ కాలపు జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రజల మాటల్లో వినిపిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అదే భవనం ఆ పాలనా చరిత్రకు నిదర్శనంగా నిలిచిందని వారు భావిస్తున్నారు.

ఇప్పుడు ఆ చారిత్రక నిర్మాణం పూర్తిగా కనుమరుగవడంతో, కనీసం గుర్తుగా అయినా దాన్ని సంరక్షించాల్సిందిగా స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్ తరాలకు గ్రామీణ పాలనా చరిత్రను చూపించే ఒక గుర్తుగా ఈ భవనం నిలిచే అవకాశం కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే, ఆ కాలపు పాలనా చరిత్రకు గుర్తుగా సమితి కార్యాలయం ముందు గడ్డం సత్యనారాయణ రెడ్డి విగ్రహం నెలకొల్పడం ఆయన పరిపాలన దక్షత కు నిదర్శనంగా ప్రజలు భావిచడం గమనార్హం