BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
19 Jun, 2026 - 07:50 PM
76 వీక్షణలు

అంగన్‌వాడీ కేంద్రం సందర్శన, రైతులతో ముఖాముఖి, కేడర్ సమావేశం, ప్రజావేదిక సభలో పాల్గొననున్న సీఎం

చిలకలూరిపేట, జూన్ 19: ముఖ్యమంత్రి జూన్ 20న పల్నాడు జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో పలు అభివృద్ధి, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:55 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి, మధ్యాహ్నం 12:15 గంటలకు లింగంగుంట్ల హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలకనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాలు, నిర్వహణను పరిశీలించనున్నారు. అనంతరం 12:50 గంటలకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు, సూచనలను నేరుగా తెలుసుకోనున్నారు.

మధ్యాహ్నం 2:15 గంటల నుంచి టీడీపీ కేడర్ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 3:50 గంటల నుంచి ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

కార్యక్రమాల అనంతరం సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 6:20 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టగా, కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు.