BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
19 Jun, 2026 - 07:45 PM
15 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో ప్రతిష్టాత్మక జాతీయ గుర్తింపు లభించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గ్రామ పంచాయతీలలో సమర్థవంతమైన మానవ వనరుల వ్యవస్థ (Human Resource System) రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కమిటీలో సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ నియమితులయ్యారు.

దేశవ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతం, సిబ్బంది నిర్వహణలో మెరుగైన విధానాల రూపకల్పన, గ్రామ పంచాయతీల సామర్థ్య వృద్ధి లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం దక్కడం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సమర్థవంతమైన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ జాతీయ స్థాయి కమిటీలో సభ్యునిగా ఎంపిక కావడం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలు, పరిపాలనా అనుభవం దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా కృష్ణ తేజకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో ప్రతిష్టాత్మక జాతీయ గుర్తింపు లభించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గ్రామ పంచాయతీలలో సమర్థవంతమైన మానవ వనరుల వ్యవస్థ (Human Resource System) రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కమిటీలో సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ నియమితులయ్యారు.

దేశవ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతం, సిబ్బంది నిర్వహణలో మెరుగైన విధానాల రూపకల్పన, గ్రామ పంచాయతీల సామర్థ్య వృద్ధి లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం దక్కడం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సమర్థవంతమైన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ జాతీయ స్థాయి కమిటీలో సభ్యునిగా ఎంపిక కావడం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలు, పరిపాలనా అనుభవం దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా కృష్ణ తేజకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.