www.ntodaynews.com
యోగాతోనే శారీరక, మానసిక ఆరోగ్యం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల : 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మంచిర్యాల పట్టణంలో ఒక రోజు 'కర్టెన్ రైజర్' (సన్నాహక) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రఘునాథ్ రావు గారు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన యోగా నిపుణులు మాట్లాడుతూ.. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుందని పేర్కొన్నారు. యోగా సాధన ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ఏకాగ్రత పెంపొందుతుందని ఆయన వివరించారు. అంతేకాకుండా, శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగి గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని యోగా ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యోగా ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు