www.ntodaynews.com
పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత డబ్బులు జమ సందర్భంగా రైతుల సమావేశం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ రైతు సేవా కేంద్రంలో వీఏఏ నాగమణి ఆధ్వర్యంలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం 2026–2027 ఆర్థిక సంవత్సరపు తొలి విడతగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రైతులకు పథకం ప్రయోజనాలు, ప్రభుత్వ సహాయం, సాగు అభివృద్ధి అవకాశాలపై వివరించారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, గవర వెంకటేశ్వర రావు, చెవ్వా నారాయణ రావు, ముద్దుల శ్రీను, మోరంపూడి శంకర్ రావు, బన్నే వెంకటేశ్వర రావు, కళ్ళేపల్లి మారేశ్వర రావు, విస్సంపల్లి పూర్ణ, దార్ల నాగేశ్వర రావు, మేడా సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.