మర్లపాలెం ఉప్పరగూడెం పాఠశాల సందర్శించిన MEO–1 మాసగిరి శ్రీనివాస్
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం
చాట్రాయి మండలంలోని మర్లపాలెం ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాలను చాట్రాయి MEO–1 మాసగిరి శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన స్వయంగా మధ్యాహ్న భోజన పథకం (MDM) భోజనాన్ని విద్యార్థులతో కలిసి భుజించి, భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. రుచి, శుభ్రత విషయంలో ఎటువంటి అశ్రద్ధ చేయకూడదని వంట సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
తరువాత విస్సన్నపేటకు చెందిన శిరం రమాదేవి – సత్యనారాయణ దంపతులు విద్యార్థులకు అందించిన నోట్ పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు వంటి విద్యా సామగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా MEO–1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, దాతలు అందించిన వస్తువులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి P. విజయలక్ష్మి, ఉపాధ్యాయులు G. సత్యనారాయణ, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.