www.ntodaynews.com
ఏలూరులో అడ్మినిస్ట్రేటివ్ జడ్జికి ఘన స్వాగతం — ఎస్పీ మర్యాద పూర్వక కలయిక
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి డి రమేష్ ఏలూరు అధికార పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు రెవిన్యూ విశ్రాంతి భవనంలో ఆయనకు అధికారిక స్వాగతం లభించింది.
ఈ క్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ జడ్జిని మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారుల ఈ కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది.