BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ – యూనిఫాం అమ్మకాల దందా అరికట్టాలి, అధిక ఫీజులను నియంత్రించాలి: ఎస్ఎఫ్ఐ (SFI)

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 02:30 PM
50 వీక్షణలు


ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ – యూనిఫాం అమ్మకాల దందా అరికట్టాలి, అధిక ఫీజులను నియంత్రించాలి: ఎస్ఎఫ్ఐ (SFI)

ఇబ్రహీంపట్నం మండలంలో కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫారాలు అమ్ముతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చైతన్య, ఎన్ఆర్ఐ పాఠశాలల వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు పరిశీలన చేపట్టి, అనంతరం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి ఎం. మహేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా బుక్స్, యూనిఫారాల అమ్మకాలు చేపడుతూ విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలో ఈ అక్రమాలపై ఆందోళనలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇబ్రహీంపట్నం మండలంలో అన్ని పాఠశాలల్లో అధిక ధరలకు పుస్తకాలు అమ్మడం స్పష్టంగా కనిపిస్తోందని వారు ఆరోపించారు. వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి అక్రమ బుక్స్ అమ్మకాలు, అధిక ఫీజుల వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు చర్యలు లేకపోవడం దారుణమని విమర్శించారు.

జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఇబ్రహీంపట్నం పరిధిలోని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల ఫీజు దందాను అరికట్టాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు, సిఐటియు జిల్లా నాయకులు ఎం. మహేష్, ఇబ్రహీంపట్నం మండల ఎస్ఎఫ్ఐ నాయకులు హర్ష, సురేష్, నాగసాయి, రాజేష్, వినయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.