www.ntodaynews.com
చండ్రుపట్ల లో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సదా భార్గవి పర్యటన
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో గిరిజన తండా సందర్శన
ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, చండ్రుపట్ల లంబాడీ తండా గ్రామపంచాయతీలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సదా భార్గవి (IAS) పర్యటించారు.
తండాకు చేరుకున్న ఆమెకు గిరిజన మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ఘన స్వాగతం పలికారు. స్థానిక సంస్కృతి ప్రతిబింబించేలా సాంప్రదాయ పద్ధతుల్లో ఆహ్వానం అందించారు.
పర్యటన సందర్భంగా తండాలోని సమస్యలు, మౌలిక వసతులు, తాగునీరు, రహదారులు, విద్య, ఆరోగ్య సేవలపై ఆమె స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధి అవసరాలపై నేరుగా ప్రజలతో మాట్లాడి పరిస్థితిని పరిశీలించారు.