వైన్ షాపులు, చెక్ పోస్ట్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్
వైన్ షాపులు, చెక్ పోస్ట్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్
పల్నాడు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ కమిషనర్ శ్రీ చమకూరి శ్రీధర్ I.A.S శుక్రవారం 19.06.2026 పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని పలు వైన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 'ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్' ద్వారా మద్యం స్టాకులను పరిశీలించి, వినియోగదారులకు దానిపై అవగాహన కల్పించారు. మద్యం దుకాణదారులు ఖచ్చితంగా MRP ధరలకే విక్రయించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా కేవలం పర్మిట్ రూముల్లోనే సేవించేలా చూడాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం గురజాల పరిధిలోని పొందుగల చెక్ పోస్ట్ను తనిఖీ చేసి, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎక్సైజ్ అధికారి కె. మణికంఠ, అసిస్టెంట్ అధికారి కె. రవీంద్ర, మరియు సి.ఐ. కర్ణ తదితరులు పాల్గొన్నారు.