BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన

తెలంగాణ
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
19 Jun, 2026 - 07:54 PM
118 వీక్షణలు

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెం గ్రామంలో గర్భిణీ మహిళ, నవజాత శిశువు మృతిచెందిన విషాద ఘటనలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలి చితాభస్మంలో శస్త్రచికిత్సలకు ఉపయోగించే కత్తెర లభించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గ్రామానికి చెందిన వనజ (20) అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సు సాధారణ ప్రసవం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

నర్సు అనుభవలేమి, నిర్లక్ష్యం కారణంగా శిశువు ప్రసవ సమయంలోనే మృతిచెందిందని, అనంతరం తీవ్ర రక్తస్రావానికి గురైన వనజ చికిత్స పొందుతూ మరణించిందని బంధువులు వాపోయారు.

తల్లీబిడ్డలకు అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం చితాభస్మాన్ని సేకరిస్తుండగా అందులో శస్త్రచికిత్సలకు ఉపయోగించే కత్తెర బయటపడడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఆసుపత్రిలో సాధారణ ప్రసవమే జరిగిందని, ఎలాంటి శస్త్రచికిత్స నిర్వహించలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. చితాభస్మంలో కత్తెర ఎలా వచ్చిందో తమకు తెలియదని వారు పేర్కొన్నారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.