www.ntodaynews.com
వెల్లలచెరువు వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
సంతమాగులూరు మండలం వెల్లలచెరువు సమీపంలోని గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నరసరావుపేట వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఢీకొన్న ప్రభావంతో ఆటో పూర్తిగా ధ్వంసమై, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.