www.ntodaynews.com
మిత్రుడి బర్త్డేకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో విషాదం
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
హైదరాబాద్లోని మియాపూర్లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై, ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన అక్కి పవన్ సందీప్ కుమార్ (23) అనే యువకుడు మృతి చెందాడు. కొండాపూర్కు వెళ్తుండగా జాతీయ రహదారిపై రెడీమిక్స్ వాహనాన్ని ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో పవన్ అక్కడికక్కడే మరణించగా, అతని స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.