BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు బంగారం మాయం.. ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 10:39 PM
77 వీక్షణలు

పల్నాడు జిల్లాలో తాకట్టు పెట్టిన బంగారం మాయమైన ఘటన కలకలం రేపింది. సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టిన సుమారు రూ.8 లక్షల విలువైన బంగారం కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడు 2024 జూలైలో 28 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1 లక్ష రుణం తీసుకోగా, అదే ఏడాది నవంబర్‌లో మరో రూ.80 వేలు రుణంగా పొందినట్లు తెలిపాడు. అనంతరం రుణాన్ని చెల్లించి బంగారం తీసుకునేందుకు కంపెనీకి వెళ్లగా అధికారులు కొంత గడువు కావాలని కోరినట్లు పేర్కొన్నాడు.

అయితే, కంపెనీ మేనేజర్ ఉద్యోగం వదిలేసి, తాకట్టు బంగారాన్ని విక్రయించినట్లు తనకు సమాచారం అందిందని బాధితుడు ఆరోపించాడు. దీంతో సుమారు రూ.8 లక్షల విలువైన ఆభరణాలు మాయమైనట్లు పేర్కొంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను కోరాడు.