మొహరం పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: అదనపు కలెక్టర్ వి. రాములు
మొహరం పండుగను మత సామరస్యంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు పిలుపునిచ్చారు. సోమవారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూన్ 26న జరగనున్న మొహరం పండుగ సందర్భంగా పీరీల నిర్వహణ, ఊరేగింపుల కోసం అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రార్థనా మందిరాలు, పీరీల వద్ద పరిశుభ్రతతో పాటు తగిన లైటింగ్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు