BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

సొంత నిధులతో నోట్ బుక్స్ అందజేసిన సర్పంచ్.

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / తల్లవెల్లంల
22 Jun, 2026 - 08:15 PM
102 వీక్షణలు

చిట్యాల మండలం తాళ్ల వెల్లంల ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ జోగు సురేష్ తన సొంత నిధులతో విద్యార్థులకు కాపీ రైటింగ్ నోట్‌బుక్స్, పుస్తకాలను సోమవారం అందజేశారు. విద్యాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో రూ.16 వేల రూపాయల విలువైన నోట్‌బుక్స్‌ను కొనుగోలు చేసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జోగు సురేష్ మాట్లాడుతూ, గ్రామంలోని విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సర్పంచ్ చేసిన సహాయాన్ని అభినందించారు. విద్యార్థులు కూడా నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు అందుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పామునుగుల్ల సునీత-బుచ్చిరాములు, వార్డు సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు,  పాల్గొన్నారు.