పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో గొర్రెలు కాస్తుండగా ఆకస్మికంగా సంభవించిన పిడుగుపాటుకు గురై సంక బుడ్డి నాగరాజు యాదవ్ (35) అనే గొర్రెల కాపరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వట్టిమర్తి గ్రామానికి చెందిన నాగరాజు యాదవ్ రోజువారీలాగే తన గొర్రెల మందతో కలిసి గ్రామ శివారులోకి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగు నేరుగా నాగరాజుపై పడటంతో ఆయన అక్కడికక్కడే మృతుడు నాగరాజు యాదవ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేతికొచ్చిన సంపాదనపరుడు, కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. నాగరాజు మరణవార్త తెలియడంతో వట్టిమర్తి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.