BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

చిట్యాల మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
01 Apr, 2026 - 04:03 PM
537 వీక్షణలు

చిట్యాల మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్  

చిట్యాల మున్సిపాలిటీ నూతన ఇన్చార్జి కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు చిట్యాల మున్సిపల్ కమిషనర్ గా నిధులు నిర్వహించిన దండ శ్రీను మార్చి 31వ తేదీన పదవీ విరమణ పొందారు. ఈ క్రమంలో ఖాళీ అయిన కమిషనర్ స్థానంలో రంజిత్ కుమార్ ను ఇంచార్జ్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. రంజిత్ కుమార్ ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీలో పూర్తిస్థాయి కమిషనర్ గా సేవలందిస్తున్నారు. నకిరేకల్ తో పాటు అదనంగా చిట్యాల పురపాలక సంఘం బాధ్యతను కూడా ఆయన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఏ రంజిత్ కుమార్ మాట్లాడుతూ చిట్యాల పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రజలకు పురపాలక సేవల విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరిన్ని సౌకర్యాలు అందిస్తానని నా వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్యం , మౌలిక వసతుల కల్పనలో ప్రజల సహకారం ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్మన్ శ్రీమతి పందిరి గీతా రమేష్, మాజీ మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను మున్సిపల్ అధికారులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.