చిట్యాల మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్
చిట్యాల మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్
చిట్యాల మున్సిపాలిటీ నూతన ఇన్చార్జి కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు చిట్యాల మున్సిపల్ కమిషనర్ గా నిధులు నిర్వహించిన దండ శ్రీను మార్చి 31వ తేదీన పదవీ విరమణ పొందారు. ఈ క్రమంలో ఖాళీ అయిన కమిషనర్ స్థానంలో రంజిత్ కుమార్ ను ఇంచార్జ్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. రంజిత్ కుమార్ ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీలో పూర్తిస్థాయి కమిషనర్ గా సేవలందిస్తున్నారు. నకిరేకల్ తో పాటు అదనంగా చిట్యాల పురపాలక సంఘం బాధ్యతను కూడా ఆయన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఏ రంజిత్ కుమార్ మాట్లాడుతూ చిట్యాల పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రజలకు పురపాలక సేవల విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరిన్ని సౌకర్యాలు అందిస్తానని నా వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్యం , మౌలిక వసతుల కల్పనలో ప్రజల సహకారం ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్మన్ శ్రీమతి పందిరి గీతా రమేష్, మాజీ మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను మున్సిపల్ అధికారులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.