చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం : కారు ఢీకొని లారీ కిందపడి యువకుడు మృతి
చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం : కారు ఢీకొని లారీ కిందపడి యువకుడు మృతి
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీ బాల నరసింహ స్వామి ఆలయ టర్నింగ్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా నీర్నాముల గ్రామానికి చెందిన ముత్యాల శివ (34) ద్విచక్రవాహనంపై చిట్యాల నుండి భువనగిరి వైపు వెళ్తున్నాడని. ఈ క్రమంలో శ్రీ బాల నరసింహ స్వామి దేవాలయ టర్నింగ్ వద్దకు రాగానే, వెనుక నుంచి అతివేగంతో వచ్చిన ఒక కారు ఆయన బైక్ను బలంగా ఢీకొట్టింది. కిందపడిపోయిన మృతుడు అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ కిందపడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.