BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

చిట్యాలలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ ముఖ్య నాయకుల సమరశంఖం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
20 May, 2026 - 06:08 PM
67 వీక్షణలు

చిట్యాలలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ ముఖ్య నాయకుల సమరశంఖం NTODAY NEWS 

25న నల్లగొండలో విస్తృత స్థాయి సమావేశానికి జయప్రదం చేయాలని పిలుపు

ఈనెల 25న నల్గొండలో నిర్వహించ తలపెట్టిన ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం చిట్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ అనుబంధ సంఘాల నకిరేకల్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగ సంయుక్తంగా మాట్లాడారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా తెలంగాణలో లభించిన 9 శాతం రిజర్వేషన్ ఫలాలను మాదిగ విద్యార్థులు, నిరుద్యోగులు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు 'గో టు విలేజ్' కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. మే 25న జరిగే జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోవింద్ నరేష్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతారని నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు మేడి శంకర్ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరసాని గోపాల్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల సుదర్శన్ మాదిగ, చిట్యాల మండల అధ్యక్షుడు నోముల పురుషోత్తం మాదిగ, నకిరేకల్ మండల అధ్యక్షుడు గాదె రాజు మాదిగ, కేతపల్లి మండల అధ్యక్షుడు వెంకటరత్నం మాదిగ, కావలి కృష్ణ మాదిగ, మహంకాళి శీను మాదిగ, జానయ్య, పంది నాగయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.