BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

చిట్యాలలో మందులపై కార్పొరేట్ డిస్కౌంట్లపై కెమిస్టుల యుద్ధం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
20 May, 2026 - 06:15 PM
123 వీక్షణలు

చిట్యాలలో మందులపై కార్పొరేట్ డిస్కౌంట్లపై కెమిస్టుల యుద్ధం న5ఓడి NTODAY NEWS చిట్యాల 

ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం చిట్యాల పట్టణంలో మెడికల్ షాపుల బంద్ పాటించి నిరసన తెలిపారు.ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలని, నకిలీ మందుల విక్రయాలను అరికట్టాలని  మందుల అక్రమ అమ్మకాల నియంత్రణ, కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న అధిక డిస్కౌంట్లపై నియంత్రణ తీసుకురావాలని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నకిలీ మందుల విక్రయాల ను పూర్తిగా నివారించాలని డిమాండ్ చేస్తూ చిట్యాల పట్టణం, మండల వ్యాప్తంగా మెడికల్ షాపులు మూసివేసి బంద్ పాటించారు.అనంతరం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో బ్యానర్లు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వల్లపు నరేందర్, గౌరవ అధ్యక్షుడు అంతటి అంజయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు ఏనుగు శేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి కైరం కొండభాస్కర్, సభ్యులు ఎస్.వెంకన్న, అంతటి స్వామి, నవీన్ రెడ్డి, గంజి శ్రీనివాస్, గంజి గోవర్ధన్, శ్రీశైలం, లింగస్వామి, నగేష్, భరత్, అరుణ్ కుమార్, రాజశేఖర్, వెంకటేశం, విక్రమ్, పాషా,రాకేష్ గౌడ్, మధు, దుర్గయ్య, మెహర్ బాబు తదితరులు పాల్గొన్నారు..