చిట్యాలలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ. వ్యక్తికి తీవ్ర గాయాలు
చిట్యాలలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ. వ్యక్తికి తీవ్ర గాయాలు
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని ఎస్బీఐ సమీపంలో రామకృష్ణ హోటల్ వద్ద ఆదివారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన కీసర అశోక్ (29) తన ద్విచక్ర వాహనంపై రామకృష్ణ హోటల్ వద్ద రోడ్డు దాటుతుండగా, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని దాని రైడర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ అశోక్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అశోక్కు తలకు, రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్ మలక్పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పెద్దమ్మ కుమారుడు దొండ వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి. వెంకట్రెడ్డి తెలిపారు.