www.ntodaynews.com
చిట్యాల రైతువేదికలలో ‘విత్తన మేళా’
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాలలో ‘విత్తన మేళా’
నల్గొండ జిల్లా మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుండి 30 వరకు చిట్యాల మండలంలోని రైతువేదికలలో ‘విత్తన మేళా’ నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 23 న చిట్యాలలోని రైతువేదికలో మండల స్థాయి విత్తన మేళా ప్రారంభం కానుంది. ఈ మేళాలో ప్రభుత్వం సూచించిన సన్న రకాల వరి విత్తనాలతో పాటు జనపనార, పప్పు దినుసుల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయి. అలాగే, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే నానో యూరియా, నానో డిఏపిలను కూడా ఒకే చోట కొనుగోలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనాలు, నానో ఎరువుల కోసం రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.