BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

చిట్యాలలో వరుస మొబైల్ చోరీలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
30 Mar, 2026 - 06:33 PM
464 వీక్షణలు

చిట్యాలలో వరుస మొబైల్ చోరీలు 

ప్రయాణకులే టార్గెట్ల చోరీలకు పాల్పడుతున్న ముఠా


నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గత వారం రోజులుగా వరుసగా జరుగుతున్న మొబైల్ ఫోన్ల దొంగతనాలు స్థానిక ప్రజలను ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.  రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఆసరాగా చేసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రయాణికులే లక్ష్యంగా మొబైల్ చోరీలకు పాల్పడుతున్నారు అని సమాచారం.  ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. చిట్యాల బస్టాండ్ మరియు భువనగిరి రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఈ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా బస్సు ఎక్కే సమయంలో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుంటున్న దొంగలు  వారి జేబుల్లోని ఫోన్లను అత్యంత చాకచక్యంగా మాయం చేస్తున్నారు. చిట్యాలలో బస్టాండ్, భువనగిరి రోడ్డుబ్లో  బస్సు ఎక్కే క్రమంలో తోపులాటను సృష్టించి ఫోన్లు దొంగతనం చేస్తున్నారు. ​వరుస దొంగతనాలతో విసిగిపోయిన బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు  ఇప్పటికే పలువురు బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. బహిరంగ ప్రదేశాల్లో భద్రతను పర్యవేక్షించాలని, సీసీ కెమెరాల ద్వారా దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రయాణికులు బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో తమ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.