www.ntodaynews.com
చిత్తూరులో మరోసారి కలెక్టర్ సంతకం ఫోర్జరీ కలకలం..!
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు జిల్లాలో మరోసారి కలెక్టర్ సంతకం ఫోర్జరీ ఘటన వెలుగులోకి వచ్చింది. కలెక్టరేట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న నిరంజన్ కుమార్, కలెక్టర్తో పాటు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సమన్వయాధికారి సంతకాలను నకిలీ చేసి రూ.6.99 లక్షలు డ్రా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
బ్యాంక్ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన సమన్వయాధికారి సుదర్శన్ విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు చిత్తూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారగా, ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రతా వ్యవస్థలు, ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.