BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

చిత్తూరులో మరోసారి కలెక్టర్ సంతకం ఫోర్జరీ కలకలం..!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:48 PM
74 వీక్షణలు

చిత్తూరు జిల్లాలో మరోసారి కలెక్టర్ సంతకం ఫోర్జరీ ఘటన వెలుగులోకి వచ్చింది. కలెక్టరేట్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిరంజన్ కుమార్, కలెక్టర్‌తో పాటు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సమన్వయాధికారి సంతకాలను నకిలీ చేసి రూ.6.99 లక్షలు డ్రా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

బ్యాంక్ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన సమన్వయాధికారి సుదర్శన్ విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు చిత్తూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారగా, ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రతా వ్యవస్థలు, ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.