BREAKING
గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు
www.ntodaynews.com

చిత్తపూరు, సోమవరం గ్రామాల శివారులలో పేకాట స్థావరాలపై చాట్రాయి పోలీసుల వరుస దాడులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 06:24 AM
44 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై చాట్రాయి పోలీసులు వరుసగా దాడులు నిర్వహించారు. చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణకు అందిన సమాచారం మేరకు జూన్ 22న చేపట్టిన దాడుల్లో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు మోటార్‌సైకిళ్లు, రూ.10,300 నగదు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అదే విధంగా సోమవారం గ్రామ శివారులో మరో పేకాట స్థావరంపై దాడి నిర్వహించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆరు మోటార్‌సైకిళ్లు, రూ.15,150 నగదు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి మొత్తం తొమ్మిది మందిపై చాట్రాయి పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు ఎస్సై డి. రామకృష్ణ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై డి. రామకృష్ణ మాట్లాడుతూ జూదం వంటి అక్రమ కార్యకలాపాలు వ్యక్తులు, కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీస్తాయని అన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో పేకాట వంటి జూదాలకు అలవాటు పడటం వల్ల కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, సామాజిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని సూచించారు. జూద క్రీడలను నిర్వహించే వారిపైనా, వాటిలో పాల్గొనే వారిపైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మండలంలో ఎక్కడైనా పేకాట, జూదం లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్-112కు లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. జూదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించబోమని, ఇటువంటి కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎస్సై స్పష్టం చేశారు.