చిత్తపూరులో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
చిత్తపూరులో డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా నూజివీడు సమన్వయకర్త బర్మా ఫణి బాబు సూచనల మేరకు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు వలసపల్లి రామకృష్ణ, జంగాల సురేష్, బత్తుల శివ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు సవరం రామారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డొక్కా సీతమ్మ జీవిత విశేషాలను గుర్తుచేశారు. ఆకలి తో బాధపడుతున్న వారికి అన్నదానం చేసి “అన్నదాత”గా పేరుపొందిన డొక్కా సీతమ్మ సేవలను కొనియాడారు. పేదలకు ఆహారం అందించడం ద్వారా ఆమె సమాజంలో మానవతా విలువలను పెంపొందించారని తెలిపారు. నేటి తరానికి కూడా ఆమె జీవితం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.