BREAKING
చక్ర వడ్డీ బారు వడ్డీ లతో ఇబ్బందుల్లో భాధితులు...! మహిళల భద్రతే లక్ష్యం హుజురాబాద్ పై డంపింగ్ యార్డ్ మోపడం ఆపాలి. రహదారి భద్రతకు పోలీస్ కవచం కొండమడుగు గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాశన కార్యక్రమం. శ్రీనివాస్ సెంటర్ టు సంజీవనగర్ గేట్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ... మంత్రి ఎన్ఎండి ఫరూక్ రహదారి ఆక్రమణలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సీరియస్ ముఖ్య కార్యకర్తలతో, నాయకులతో సమావేశం నిర్వహించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ​సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ధాన్యాల కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం చక్ర వడ్డీ బారు వడ్డీ లతో ఇబ్బందుల్లో భాధితులు...! మహిళల భద్రతే లక్ష్యం హుజురాబాద్ పై డంపింగ్ యార్డ్ మోపడం ఆపాలి. రహదారి భద్రతకు పోలీస్ కవచం కొండమడుగు గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాశన కార్యక్రమం. శ్రీనివాస్ సెంటర్ టు సంజీవనగర్ గేట్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ... మంత్రి ఎన్ఎండి ఫరూక్ రహదారి ఆక్రమణలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సీరియస్ ముఖ్య కార్యకర్తలతో, నాయకులతో సమావేశం నిర్వహించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ​సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ధాన్యాల కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం
www.ntodaynews.com

చక్ర వడ్డీ బారు వడ్డీ లతో ఇబ్బందుల్లో భాధితులు...!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Apr, 2026 - 12:18 PM
7 వీక్షణలు

చక్ర వడ్డీ, బారు వడ్డీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు

వడ్డీ దందా నుండి రక్షించాలంటూ వేడుకోలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో అక్రమ వడ్డీ వ్యాపారాలు విస్తృతంగా పెరుగుతున్నాయి. కట్టకింద పాళ్యం, ఎన్‌ఎస్ పేట, మంగళం కాలనీ ప్రాంతాల్లో మధ్యతరగతి మరియు పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వడ్డీ దందా కొనసాగుతోందని బాధితులు చెబుతున్నారు. చిన్న మొత్తాలుగా ఇచ్చిన రుణాలపై అధిక వడ్డీలు విధిస్తూ, అవసరాన్ని బట్టి మరింత వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని, ఎలాంటి లైసెన్స్‌లు లేకుండా కొందరు వ్యక్తులు ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారని సమాచారం. రుణం పేరుతో ఇంటి పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, చెక్కులు తీసుకుని తరువాత బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు వాపోతున్నారు.

డబ్బు అవసరాన్ని ఆసరాగా చేసుకుని అమాయకులను మోసం చేస్తూ, వడ్డీ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఫిర్యాదులకు భయపడకుండా అసభ్యంగా ప్రవర్తిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో బాధితులు పోలీసుల జోక్యం అవసరమని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.