BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

చక్ర వడ్డీ బారు వడ్డీ లతో ఇబ్బందుల్లో భాధితులు...!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Apr, 2026 - 12:18 PM
47 వీక్షణలు

చక్ర వడ్డీ, బారు వడ్డీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు

వడ్డీ దందా నుండి రక్షించాలంటూ వేడుకోలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో అక్రమ వడ్డీ వ్యాపారాలు విస్తృతంగా పెరుగుతున్నాయి. కట్టకింద పాళ్యం, ఎన్‌ఎస్ పేట, మంగళం కాలనీ ప్రాంతాల్లో మధ్యతరగతి మరియు పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వడ్డీ దందా కొనసాగుతోందని బాధితులు చెబుతున్నారు. చిన్న మొత్తాలుగా ఇచ్చిన రుణాలపై అధిక వడ్డీలు విధిస్తూ, అవసరాన్ని బట్టి మరింత వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని, ఎలాంటి లైసెన్స్‌లు లేకుండా కొందరు వ్యక్తులు ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారని సమాచారం. రుణం పేరుతో ఇంటి పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, చెక్కులు తీసుకుని తరువాత బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు వాపోతున్నారు.

డబ్బు అవసరాన్ని ఆసరాగా చేసుకుని అమాయకులను మోసం చేస్తూ, వడ్డీ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఫిర్యాదులకు భయపడకుండా అసభ్యంగా ప్రవర్తిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో బాధితులు పోలీసుల జోక్యం అవసరమని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.