BREAKING
ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక
www.ntodaynews.com

చక్ర వడ్డీ బారు వడ్డీ లతో ఇబ్బందుల్లో భాధితులు...!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Apr, 2026 - 12:18 PM
68 వీక్షణలు

చక్ర వడ్డీ, బారు వడ్డీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు

వడ్డీ దందా నుండి రక్షించాలంటూ వేడుకోలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో అక్రమ వడ్డీ వ్యాపారాలు విస్తృతంగా పెరుగుతున్నాయి. కట్టకింద పాళ్యం, ఎన్‌ఎస్ పేట, మంగళం కాలనీ ప్రాంతాల్లో మధ్యతరగతి మరియు పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వడ్డీ దందా కొనసాగుతోందని బాధితులు చెబుతున్నారు. చిన్న మొత్తాలుగా ఇచ్చిన రుణాలపై అధిక వడ్డీలు విధిస్తూ, అవసరాన్ని బట్టి మరింత వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని, ఎలాంటి లైసెన్స్‌లు లేకుండా కొందరు వ్యక్తులు ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారని సమాచారం. రుణం పేరుతో ఇంటి పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, చెక్కులు తీసుకుని తరువాత బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు వాపోతున్నారు.

డబ్బు అవసరాన్ని ఆసరాగా చేసుకుని అమాయకులను మోసం చేస్తూ, వడ్డీ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఫిర్యాదులకు భయపడకుండా అసభ్యంగా ప్రవర్తిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో బాధితులు పోలీసుల జోక్యం అవసరమని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.