చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన
ఎన్ టుడే న్యూస్, గోపాలపురం నియోజకవర్గం:
పేదల పట్ల అపారమైన సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం ఒక రోజు ఖర్చుల నిమిత్తం ₹76 లక్షల విరాళం అందించడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.ఈ సందర్భంగా గోపాలపురం టౌన్లోని అన్న క్యాంటీన్ను గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు గారు సందర్శించారు. అక్కడ ప్రజలతో కలిసి భోజనం చేసి, వారి సమస్యలు, అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న సేవలకు ఇది మంచి ఉదాహరణగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, రేపటి తరాల తలరాతలను మార్చే ప్రగతి స్వాప్నికుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిలిచారని కొనియాడారు. తెలుగువారి ఉనికి ఉన్నంతకాలం ఆయనను మహానీయునిగా, తెలుగు జాతి గర్వంగా గుర్తుంచుకుంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.