BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తి – రెడ్డిగూడెంలో భారీ నిరసన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 02:46 PM
89 వీక్షణలు

మోసపూరిత హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు వెన్నుపోటు రాజకీయాలు కొనసాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

ఎన్టీఆర్ జిల్లా (రెడ్డిగూడెం మండలం)

 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో తీవ్ర నిరసన కార్యక్రమం జరిగింది.

 మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాల మేరకు, రెడ్డిగూడెం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

మెయిన్ సెంటర్‌లో ర్యాలీ – కూటమి ప్రభుత్వంపై నినాదాలు

రెడ్డిగూడెం మెయిన్ సెంటర్‌లో భారీ ర్యాలీ నిర్వహించి, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగుతోందని ఆరోపిస్తూ నినాదాలు హోరెత్తాయి.

 “మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు”

 “ప్రజల ఆశలను వంచించారు”

 “అసమర్థ పాలన కొనసాగుతోంది”

అని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేనిఫెస్టో దహనం – తీవ్ర నిరసన

కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను దహనం చేస్తూ నాయకులు, కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేశారు.

ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలతో రెడ్డిగూడెం ప్రాంతం ఉద్రిక్త వాతావరణాన్ని తలపించింది.

 స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాజకీయ వేడి పెంచిన “రెండేళ్ల” కార్యక్రమం

కూటమి ప్రభుత్వ పాలనపై అసంతృప్తి, వైఫల్యాల ఆరోపణలతో ఈ కార్యక్రమం జిల్లాలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.