చనుబండ గ్రామంలో కొలుసు పార్థసారథి జన్మదినోత్సవం
చనుబండ గ్రామంలో కొలుసు పార్థసారథి జన్మదినోత్సవం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఈ రోజు మంత్రి కొలుసు పార్థసారథి గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరిపారు. మోరంపూడి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి, ఉపాధి కూలీలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి డ్రింక్స్ పంపిణీ చేశారు.
అలాగే, ప్రతి కుటుంబానికి ఒక సొరకాయ బహుమతిగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మోరంపూడి శ్రీనివాసరావు, ములగలపాటి శ్రీనివాసరావు, బొట్టు దుర్గారావు, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ చిదిరాల మారేశ్వరరావు, నూజివీడు అసెంబ్లీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మోదుగు లక్ష్మి విమలకుమారి, నూజివీడు ఎస్సీ సెల్ సెక్రటరీ నక్క రాము, మోదుగు ముత్తయ్య పాల్గొన్నారు.
ఈ వేడుకలో గ్రామ ప్రజలతో కలిసి అన్నిరకాల సంతోషం మరియు ఆత్మీయతను పంచుకున్నారు.