చనుబండ కోదండరామాలయంలో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం
ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలోని శ్రీ కోదండరామాలయంలో 03.06.2026న విజయవాడ వేగా జ్యువెలర్స్ తరఫున వనమా కేశవరావు దంపతులు అన్నసమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టి సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, ఆలయ ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి, సేవ్వ మోహనరావు, తాళ్లాడ వెంకటేశ్వరరావు, చీపు వెంకటేశ్వరరావు, కొత్తగుండ్ల రమేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా వనమా కేశవరావు దంపతుల సేవాభావాన్ని పలువురు అభినందించారు. సమాజంలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేందుకు ఇటువంటి ధార్మిక, సేవా కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. భక్తులకు అన్నదానం చేయడం మహాదానంగా భావించబడుతుందని, ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.