కొత్త చట్టాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై కె.వెంకన్న
కొత్త చట్టాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై కె.వెంకన్న
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ధర్మాజీగూడెం, జూలై 19: ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని శ్రీవిద్య హై స్కూల్లో శనివారం ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ ఎస్సై కె. వెంకన్న ఆధ్వర్యంలో కొత్త చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై కె. వెంకన్న మాట్లాడుతూ పోక్సో చట్టం, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నిషేధ చట్టంపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. చట్టాలపై అవగాహన కలిగి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవిద్య హై స్కూల్, శ్రీచక్ర కాలేజీ విద్యార్థినీ, విద్యార్థులు, పాఠశాల డైరెక్టర్ సీహెచ్. రత్నాకర్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.