www.ntodaynews.com
నేడు చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్
ఆంధ్రప్రదేశ్
నేడు చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలతో పాటు హైకోర్టులో కూడా చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నారు.
ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో ప్రస్తుతం న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న చెక్ బౌన్స్ కేసులతో పాటు అప్పీళ్ల దశలో ఉన్న కేసులను కూడా పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంది.
లోక్ అదాలత్లో ఇరు పక్షాల అంగీకారంతో ఇచ్చే తీర్పు అంతిమమైనది. ఈ తీర్పుపై అప్పీల్కు అవకాశం ఉండదు. దీంతో సమయం, వ్యయం ఆదా కావడంతో పాటు కేసులు త్వరితగతిన పరిష్కారం పొందుతాయని న్యాయాధికారులు తెలిపారు.