www.ntodaynews.com
ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో నేడు మంత్రుల పర్యటన
తెలంగాణ
/
కరీంనగర్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో నేడు మంత్రుల పర్యటన
కరీంనగర్, జూలై 19: ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో నేడు పలువురు రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ పనుల పురోగతి, రైతులకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పాల్గొంటారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరై జిల్లాల్లోని వ్యవసాయ పరిస్థితులు, సాగునీటి లభ్యత, రైతులకు అందించాల్సిన సహాయ చర్యలపై చర్చించనున్నారు.