BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

ఈనెల 21న మంచిర్యాలకు కేటీఆర్ రాక

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Jul, 2026 - 07:31 PM
108 వీక్షణలు
ఈనెల 21న మంచిర్యాలకు కేటీఆర్ రాక: బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్

  • మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం
  • ఓటర్ల సవరణ ప్రక్రియపై అధికారుల లెక్కలు తప్పు

ఈనెల 21న మంచిర్యాల జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ వెల్లడించారు. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పర్యటనలో భాగంగా లక్షెట్టిపేట మండలంలోని వాసవి ఫంక్షన్ హాల్‌లో ‘రైతు సదస్సు’ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లో మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలకు బీఆర్‌ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ చేతుల మీదుగా రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

​ఇదే సమావేశంలో విజిత్ కుమార్ మాట్లాడుతూ.. మంచిర్యాల నియోజకవర్గంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఎస్‌ఆర్) ప్రక్రియపై అధికారులు, ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు. ఎన్యూమరేషన్ పత్రాలను 100 శాతం పంపిణీ చేశామనడం ముమ్మాటికీ అబద్ధమని, తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులైన ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వాస్తవంగా ఎంతవరకు పూర్తయిందో అసలు నిజాలను అధికారులు వెంటనే బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు