www.ntodaynews.com
రేపు ప్రైవేట్ సమీకృత ఆయిల్పామ్ పరిశ్రమ ప్రారంభం
తెలంగాణ
/
ఖమ్మం
రేపు ప్రైవేట్ సమీకృత ఆయిల్పామ్ పరిశ్రమ ప్రారంభం
ఖమ్మం, జూలై 19: తెలంగాణలో తొలి ప్రైవేట్ సమీకృత ఆయిల్పామ్ పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థ రూ.300 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను నిర్మించింది.
ఈ పరిశ్రమను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 700 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే ఆయిల్పామ్ నర్సరీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు విస్తరణకు, రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ఈ సమీకృత పరిశ్రమ కీలకంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.