చనుబండ నుంచి కాట్రేనిపాడుకు భారీగా తరలిన టీడీపీ శ్రేణులు
ఏలూరు జిల్లా, ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో పాప్కార్న్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరైన సందర్భంగా చనుబండ నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.
నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు చీదిరాల మారేశ్వరరావు, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ ఆధ్వర్యంలో చనుబండ నుంచి సుమారు 200 మంది కార్యకర్తలు కాట్రేనిపాడు సమావేశానికి బయలుదేరి వెళ్లారు.
కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని నాయకులకు స్వాగతం పలికారు. పాప్కార్న్ కంపెనీ ప్రారంభోత్సవానికి నియోజకవర్గం నుంచి భారీగా ప్రజలు, కార్యకర్తలు తరలిరావడంతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది.