BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

చనుబండ శాఖా గ్రంథాలయంలో సమ్మర్ శిక్షణ శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Apr, 2026 - 09:29 PM
39 వీక్షణలు

చనుబండ శాఖా గ్రంథాలయంలో సమ్మర్ శిక్షణ శిబిరం

కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం (సమ్మర్ ఓరియంటేషన్ ప్రోగ్రాం)ను 28-04-2026 నుండి 06-06-2026 వరకు స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో సృజనాత్మకత, బాధ్యతాభావం పెంపొందించడం తో పాటు సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించడం, సైబర్ మోసాలకు గురికాకుండా అవగాహన కల్పించడం.

శిబిరంలో భాగంగా పేపర్ క్రాఫ్ట్, మొక్కలు పెంచడం మరియు వాటి సంరక్షణ, కథలు చదవడం-వినడం ద్వారా ఆలోచన శక్తి పెంపొందించడం వంటి అంశాలు నేర్పించనున్నారు. అలాగే కంప్యూటర్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించడంతో పాటు క్యారమ్స్, చెస్ వంటి ఆటలను కూడా బోధించనున్నారు.

ఈ కార్యక్రమాలు గ్రంథాలయాధికారుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ నిర్వహించబడతాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ శిబిరానికి పంపి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని గ్రంథాలయాధికారి కె. శ్రీకాంత్ కోరారు.