www.ntodaynews.com
చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం
ఆంధ్రప్రదేశ్
చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం ఉత్సాహంగా
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం భాగంగా ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు కథల పుస్తకాలు చదువుతూ ఆసక్తిగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు క్యారమ్స్ ఆటలను నిర్వహించి, వారిలో చురుకుదనం మరియు సామూహిక భావన పెంపొందించేలా చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమాన్నిబీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వరరావు పర్యవేక్షించగా, గ్రంథాలయ అధికారి కె. శ్రీకాంత్ నిర్వహించారు. శిబిరం ద్వారా విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెంపొందించడంతో పాటు వినోదంతో కూడిన అభ్యాసం అందించడమే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగింది.