www.ntodaynews.com
చనుబండలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చనుబండలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చనుబండ గ్రామంలో కొలువై ఉన్న లక్ష్మీనరసింహస్వామి, చెంచులక్ష్మీదేవి అమ్మవారుల కల్యాణ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా, కనుల పండుగలా నిర్వహించారు.
ఈ వేడుకల్లో ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి దివ్య కల్యాణాన్ని దర్శించుకున్నారు.
అనంతరం ఉత్సవమూర్తిగా స్వామి వారు చనుబండ గ్రామ వీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి గ్రామ ప్రజలకు దర్శనం ఇచ్చి ఆశీర్వదించారు. భక్తి శ్రద్ధలతో నిండిన ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.