BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

చనుబండలో రైతులకు ఎల్నినో నివారణ చర్యలపై విఏఏ నాగమణి అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 05:02 PM
64 వీక్షణలు

చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామ రైతు సేవా కేంద్రంలో రైతులకు ఎల్నినో ప్రభావ నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామసభను వీఏఏ నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎల్నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో చేపడుతున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా రైతులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా రైతులు తమ పొలాలను క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవాలని, ప్రస్తుత పంట పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, బీడు భూముల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడంతో పాటు అంతర పంటల విధానాన్ని అవలంబించాలని అవగాహన కల్పించారు.

అలాగే ఏపీ ఏఐఎంఎస్‌ 2.0 ద్వారా వ్యవసాయ కార్యకలాపాల పారదర్శక పర్యవేక్షణ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, పీఎండీఎస్‌ అమలులో రైతులు సూచనలు పాటించడం వంటి అంశాలను వివరించారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల యాజమాన్య పద్ధతులను పాటించాలని తెలిపారు.

ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. పంటల్లో తెగుళ్లు, పురుగుల ఉద్ధృతి కనిపిస్తే వెంటనే రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి వ్యవసాయ శాఖ సలహాలు పొందాలని సూచించారు.

కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు బి. రమేష్, కె. రమేష్, జి. వెంకటేశ్వరరావు, రైతు సేవా కేంద్రం సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.